
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఆగిపోయిందని.. సీజ్ ఫైర్ కు ఇరుదేశాలు అంగీకరించాయని ఒకవైపు యూఎస్ ప్రసిడెంట్ ట్రంప్ పదేపదే ప్రకటిస్తున్నారు. కానీ మీరు ఏమైనా చెప్పండి.. మా పంథా మారదు అన్నట్లు మొదట ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ ఉల్లంఘించింది. మంగళవారం (జూన్ 24) ఇరాన్ పై మిస్సైళ్లతో విరుచుకుపడింది. దీనికి ప్రతిదాడి చేసి ఇరాన్ కూడా ఎక్కడా తగ్గలేదు.
ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన క్రమంలో.. ఇజ్రాయెల్ కు మద్ధతుగా ఉంటూ వస్తున్న అమెరికా ఈ సారి కాస్త ఘాటుగా స్పందించింది. మిత్రదేశమైన ఇజ్రాయెల్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే మీ పైలట్ లను ఇంటికి తీసుకెళ్లండి.. లేదంటే పరిణామాలు సీరియస్ గా ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు.
►ALSO READ | వర్ధమాన్ను పట్టుకున్న పాక్ ఆర్మీ మేజర్ మోయిజ్ అబ్బాస్ షా ఎన్కౌంటర్లో మృతి
అయితే అటు సీజ్ ఫైర్ అమలులో ఉండగానే ఇరాన్ మరో చర్యకు పాల్పడటం సంచలనంగా మారింది. ఇజ్రాయెల్ స్పై ఏజెన్సీ కోసం గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలతో ముగ్గురిని బుధవారం (జూన్ 25) ఉరితీసింది. ఇజ్రాయెల్-ఇరాన్ కాల్పుల విరమణకు ఒప్పుకున్న మరుసటి రోజే ఉరి తీయడం చర్చనీయాంశంగా మారింది.
ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ తో కొలాబరేట్ అవ్వటమే కాకుండా.. మారణాయుధాల స్మగ్లింగ్ చేసిన నెపంతో వారిని ఉరి తీసినట్లు మిజాన్ అనే ఏజెన్సీ పేర్కొంది. అదే విధంగా ఇజ్రాయెుల్ తో సంబంధాలు కలిగి ఉన్న 700 మంది పౌరులను అరెస్టు చేసినట్లు ఇరాన్ అధికారిక మీడియా సంస్థ Nournews వెల్లడించింది.