ఉక్రెయిన్పై రష్యా దాడి..16 మంది పౌరులు మృతి

ఉక్రెయిన్పై రష్యా దాడి..16 మంది పౌరులు మృతి

కీవ్: ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌ పై రష్యా మరోసారి డ్రోన్‌‌‌‌‌‌‌‌లు, మిస్సైల్స్, ఆర్టిలరీలతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌లో 16 మంది పౌరులు మరణించారు. దాదాపు 100 మంది గాయపడ్డారు. ఈ దాడులు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌‌‌‌‌‌‌‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగాయి. మంగళవారం మధ్యాహ్నం డ్నిప్రోలోని నివాసాలపై రష్యా బాలిస్టిక్ క్షిపణితో దాడి చేసింది. ఈ దాడిలో ఏడుగురు వ్యక్తులు మరణించారు. 70 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. 

అలాగే, సమీపంలోని సమర్ పట్టణంలో జరిగిన దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో 9 మంది గాయపడ్డారని డ్నిప్రో ప్రాంతీయ పరిపాలన అధిపతి సెర్హి లైసాక్ టెలిగ్రామ్‌‌‌‌‌‌‌‌లో వెల్లడించారు. ఉక్రెయిన్ దక్షిణ ఖెర్సన్ ప్రాంతంలోని నివాస ప్రాంతాలు, కీలకమైన మౌలిక సదుపాయాలపై కూడా రష్యా బాంబు దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు పౌరులు మరణించారు. పదకొండు మంది గాయపడ్డారని ప్రాంతీయ సైనిక పరిపాలన అధిపతి ఒలెక్సాండర్ ప్రోకుడిన్ తెలిపారు.