
జీడిమెట్ల, వెలుగు: గ్రానైట్ రాళ్లు మీద పడి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం... గుజరాత్ నుంచి కొంపల్లిలోని ఆర్ఆర్ ఆర్ కన్స్ట్రక్షన్ వద్దకు గ్రానైట్ రాళ్లతో ఓ లారీ వచ్చింది.
శనివారం లారీలోంచి గ్రానైట్ రాళ్లను దింపేందుకు మధ్యప్రదేశ్ కి చెందిన సీతాశరణ్(36) లఖాన్(25) పైకెక్కి గ్రానైట్ సపోర్ట్ కర్రను తొలగించారు. దీంతో గ్రానైట్ రాళ్లు ఒకసారి మీద పడడంతో రాళ్ల మధ్యన ఇరుక్కుపోయారు. తోటి కార్మికులు పోలీసులతో కలిసి బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.