తల్లిపక్కన పడుకున్నచిన్నారి.. తెల్లారేసరికి డెడ్ బాడీ

తల్లిపక్కన పడుకున్నచిన్నారి.. తెల్లారేసరికి డెడ్ బాడీ

రంగారెడ్డి జిల్లా అనాజ్ పూర్ లో దారుణం జరిగింది. రాత్రి తల్లి పక్కన పడుకున్న రెండు నెలల బాలుడిని ఇంటిపైన నీటి ట్యాంకులో పడేశారు దుండగులు. మార్నింగ్ బాలుడి కోసం వెతకగా.. ఇంటి పైన ఉన్న ట్యాంకులో బాలుడి డెడ్ బాడీ కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో ముగినిపోయారు. పెళ్లయిన తర్వాత తమకు 12 ఏళ్లకు బాలుడు పుట్టాడని తల్లిదండ్రులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలుడిని ఎవరు ట్యాంకులో పడేశారనే కోణంలో విచారిస్తున్నారు.