ఊబర్ క్యాబ్ సర్వీసులు షురూ

ఊబర్ క్యాబ్ సర్వీసులు షురూ
  • డ్రైవర్లకు కరోనాపై వీడియో క్లాసులు చెప్తున్నట్లు ప్రకటన

బెంగళూరు: కర్నాటకలో క్యాబ్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లాక్​డౌన్ 4.0 మార్గదర్శకాలకు అనుగుణంగా బెంగళూరు, మైసూరు, మంగళూరు, హుబ్బళ్లి లలో క్యాబ్ సర్వీసులను తిరిగి ప్రారంభించినట్లు ఊబర్ కంపెనీ శుక్రవారం ప్రకటించింది. బెంగళూరులోని రైడర్స్ ఊబర్ ఆటో, ఊబర్ గో, ప్రీమియర్, ఇంటర్‌సిటీ, ఊబర్ ఎక్స్ఎల్ వెహికల్స్ ను యాప్‌లో బుక్ చేసుకోవచ్చని సూచించింది. మైసూరులో ఊబర్ ఆటో, ఊబర్ గో, ప్రీమియర్, ఇంటర్‌సిటీ అందుబాటులో ఉంటాయని చెప్పింది. మంగళూరులోని ఊబర్ గో, ఇంటర్‌సిటీ సేవలు, హుబ్బల్లిలోని ఉబెర్ఆటో మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. క్యాబ్స్ రాష్ట్ర బోర్డర్​లు దాలబోవని, ప్రభుత్వం అనుమతించిన ఏరియాల్లోనే నడుపుతామని స్పష్టం చేసింది. డ్రైవర్లకు మాస్కులు, శానిటైజర్లు, పీపీఈ కిట్లను పంపిణీ ప్రారంభించామని, వారికి కరోనాపై అవగాహణ కల్పించేందుకు వీడియో క్లాసులు ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నామని తెలిపింది.