కోటక్ మహీంద్రా బ్యాంక్మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ఆఫీసర్ ఉదయ్కోటక్ తన పదవికి శనివారం( 2023 సెప్టెంబర్2) రాజీనామా చేశారు. ఇంకా మూడు నెలల పదవీ కాలం మిగిలి ఉండగానే ఉదయ్కోటక్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో జాయింట్ఎండీ దీపక్ గుప్తా సీఈవో, ఎండీ బాధ్యతలు నిర్వహించనున్నారు. 2023 డిసెంబర్31న బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ఆఫీసర్గా, మేనేజింగ్ డైరెక్టర్గా ఉదయ్కోటక్ పదవీకాలం ముగియనుంది.
ఉదయ్ కోటక్ తన రాజీనామాను సోషల్మీడియాలో వేదిక ద్వారా శనివారం (సెప్టెంబర్2న) ప్రకటించారు. స్వచ్ఛందంగానే వైదొలుగుతున్నట్లు చెప్పారు. పదవీ విరమణ తర్వాత తాను వ్యక్తిగత, కుటుంబం కోసం సమయం గడపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో భారత దేశంలో కీలక పాత్ర పోషిస్తాం అని ఉదయ్ కోటక్ అన్నారు.