ఉగాది సందర్భంగా ఖమ్మం సిటీలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. షడ్రుచులతో కలిపిన ఉగాది పచ్చడిని సేవించారు. ఖమ్మం సిటీలోని ఖానాపురంలో ఉన్న అభయ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు, అర్చకులు ఉగాది పంచాంగాన్ని చదివి వినిపించారు.
