ఉక్రెయిన్ కు సైనిక సాయం చేస్తామన్న బైడెన్

ఉక్రెయిన్ కు సైనిక సాయం చేస్తామన్న బైడెన్

మాస్కోను దీటుగా  ఎదుర్కొనేలా  తమకు యుద్ధ  విమానాలను, ట్యాంకులను, భారీ సైనిక వ్యవస్థలను అందజేయాలని  పాశ్చాత్య దేశాలను కోరుతున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. దీనిపై చర్చించేందుకు  అమెరికా అధ్యక్షుడు  జో బైడెన్, నాటో   దేశాధినేతలు బ్రసెల్స్ లో సమావేశమైన మరుసటిరోజే...  థియేటర్ పై దాడిలో పౌరుల మరణాలకు సంబంధించిన నివేదికను బయటపెట్టారు ఉక్రెయిన్  అధికారులు. ఈ దాడి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఉక్రెయిన్ కు మరింత సైనిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు బైడెన్ . కీవ్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న మాస్కో బలగాలు... కీవ్ పరిరక్షణకు కీలకమైన ఇంధన నిల్వ కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు ప్రకటించాయి రష్యా సైనిక వర్గాలు.

అమెరికా సహా  పశ్చిమ దేశాలు  తమపై  పూర్తిస్థాయి  హైబ్రీడ్ యుద్ధం  ప్రకటించాయని ఆరోపించారు  రష్యా విదేశాంగ  మంత్రి   సెర్గీ లావ్రోవ్. తమ  ఆర్థిక వ్యవస్థను, రష్యాను సర్వనాశనం  చేయటమే  ఆ దేశాల  లక్ష్యమన్నారు. ఉక్రెయిన్  యుద్ధంలో తమ సైనికులు 1,351 మంది  మృతిచెందారని,  మరో 3,825  మంది గాయపడ్డారని  తెలిపారు  రష్యా సైనిక ఉన్నతాధికారి  కల్నల్ జనరల్  సెర్గీ రుడ్ స్కోయ్.  ఇప్పటి వరకూ  16 వేల మంది రష్యా సైనికులను  మట్టుబెట్టినట్టు  ప్రకటించింది ఉక్రెయిన్  సైన్యం.

మరిన్ని వార్తల కోసం

 

నాలుగు రోజుల్లో మూడోసారి.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

రాజీవ్ గృహాలను పరిశీలించిన సీఎస్ సోమేశ్