- ఖమ్మం జిల్లా వైరాలో ఘటన
వైరా, వెలుగు: చికెన్ రేటు కిలో రూ.300కు చేరడంతో కోళ్లు చోరీకి గురవుతున్నాయి. ఖమ్మం జిల్లా వైరాలోని చికెన్షాపులో 7 కోళ్లను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం కోళ్ల చోరీ వీడియో సోషల్మీడియాలో వైరల్అవుతోంది. వైరా టౌన్లోని మెయిన్రోడ్డు పక్కన వెంకన్న అనే వ్యాపారి చికెన్ షాపు నిర్వహిస్తున్నాడు. సోమవారం రోజూలాగే షాపు ముందున్న ఇనుప పంజరంలో కోళ్లను ఉంచి తాళం వేశాడు. అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్పై వచ్చి తాళాలు పగలగొట్టి ఏడు కోళ్లను ఎత్తుకెళ్లారు. అదంతా షాపు ముందున్న సీసీ కెమెరాలో రికార్డ్అయ్యింది. మంగళవారం ఉదయం కోళ్లు కనిపించకపోవడంతో సీసీ ఫుటేజీ పరిశీలించగా వెంకన్నకు అసలు విషయం తెలిసింది. చికెన్ ధరలు పెరగడంతోనే ఇలా చేస్తున్నారంటూ స్థానికులు చెప్పుకుంటున్నారు. 3 కేజీలు ఉండే ఏడు కోళ్లు చోరీకి గురైనట్లు బాధితుడు వెంకన్న స్థానిక పీఎస్లో కంప్లైంట్చేశాడు.