
నర్సాపూర్, వెలుగు: నర్సాపూర్ మండలం కొండాపూర్ అటవీ ప్రాంతంలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు నెలల పసి బాలుడిని వదిలి వెళ్లారు. అటుగా వెళ్తున్న వాహనదారులు బాలుడి ఏడుపును గమనించి చూడగాఒంటరిగా కనిపించాడు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వైద్య సిబ్బందితో వచ్చి బాలుడిని నర్సాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం బాలుడు ఆరోగ్యంగానే ఉన్నాడని, బాలుడిని సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని పేర్కొన్నారు. బాలుడిని ఎవరూ అక్కడ వదిలేసి వెళ్లారో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని ఎస్ఐ లింగం పేర్కొన్నారు.