- 2047 నాటికి రక్తహీనత నిర్మూలనకు మిషన్
- రూ.89,155 కోట్ల అలాట్మెంట్
- 157 కొత్త నర్సింగ్ కాలేజీలు
- ఐసీఎంఆర్ ల్యాబ్లలో ‘ప్రైవేట్’ రీసెర్చ్కు రెడ్ కార్పెట్
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు 13 శాతం పెరిగాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు కిందటేడాది రూ.79,145 కోట్లను కేటాయించగా.. ఈసారి రూ.89,155 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో రూ.2,980 కోట్లను హెల్త్ రిసెర్చ్ డిపార్ట్మెంట్ కు అలాట్ చేశారు. ఈసారి మహిళలపై స్పెషల్ ఫోకస్ తో బడ్జెట్ సాగింది. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది మహిళలను ఇబ్బందిపెడుతున్న సికిల్ సెల్ ఎనీమియా (రక్తహీనత)ను 2047లోగా నిర్మూలించేందుకు ప్రత్యేక హెల్త్ మిషన్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో భాగంగా దేశంలో రక్తహీనత ప్రభావం ఎక్కువగా ఉన్న గిరిజన ప్రాంతాల్లోని 40 ఏళ్లలోపు 7 కోట్ల మందికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ముందుకు తీసుకెళ్తాయని చెప్పారు.
102 కోట్ల మందికి 220 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్లు
దేశంలో మరో 157 కొత్త నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని నిర్మల ప్రకటించారు. 2014 నుంచి ఇప్పటివరకు ప్రారంభించిన కొత్త మెడికల్ కాలేజీల్లోనే వీటి ఏర్పాటు జరుగుతుందని స్పష్టం చేశారు. మెడికల్ డివైజెస్ వినియోగానికి సంబంధించి ప్రత్యేక కోర్సులను ప్రారంభిస్తామన్నారు. తద్వారా దేశంలో ఆధునిక వైద్య ఉపకరణాలను వినియోగించగలిగే నిపుణుల లభ్యత పెరుగుతుందని చెప్పారు. ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ను ప్రోత్సహించేందుకు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఓ కొత్త ప్రోగ్రామ్ను ప్రారంభిస్తామన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కు చెందిన లేబొరేటరీల్లో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల ఫ్యాకల్టీ, ప్రైవేటు ఫార్మా కంపెనీల రీసెర్చ్టీమ్స్ ప్రయోగాలు చేసుకునే అవకాశాన్ని కల్పించాలని డిసైడ్ చేశామన్నారు. ఆర్అండ్ డీ విభాగంలో పెట్టుబడులు పెంచేలా ఫార్మా రంగాన్ని ప్రోత్సహిస్తామన్నారు.
హెల్త్ కేర్.. ప్రయారిటీ హయ్యర్
2022 బడ్జెట్ కేటాయింపు
రూ.79,145 కోట్లు
2023 బడ్జెట్ కేటాయింపు
రూ.89,155 కోట్లు
కేటాయింపుల్లో వృద్ధి
13శాతం