తెలంగాణకు రాజ్నాథ్ సింగ్..హుజురాబాద్లో బహిరంగ సభ

తెలంగాణకు రాజ్నాథ్ సింగ్..హుజురాబాద్లో బహిరంగ సభ

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇవాళ(అక్టోబర్16) తెలంగాణకు రానున్నారు. బీజేపీ అభ్యర్థుల తరఫున ఆయన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆర్మీ హెలిక్యాప్టర్లో బయల్దేరి మధ్యాహ్నం 12.50 నిమిషాలకు హుజూరాబాద్ కు వెళ్తారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

మధ్యాహ్నం 2.30 నిమిషాలకు హుజూరాబాద్ నుంచి బయల్దేరి 3.10 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వస్తారు. తర్వాత మహేశ్వరంలో నిర్వహించే బీజేపీ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడతారు. సాయంత్రం 5.40 నిమిషాలకు శంషాబాద్ నుంచి ఢిల్లీకి తిరిగి బయల్దేరుతారు రాజ్ నాథ్ సింగ్..