
హైదరాబాద్: క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. సోమవారం ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో నూతనంగా నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఆడిటోరియాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... క్రీడలు దేహ దారుఢ్యంతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. చదువుతో పాటు ఆటలు కూడా విద్యార్థుల జీవితంలో భాగం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఇఫ్లూ వీసీ సురేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.