కేంద్ర మంత్రి అనగానే భారీ సెక్యూరిటీ, ఆయన ఎటైనా వెళ్తున్నాడంటే ముందు వెనుకా బోలెడు కార్లతో పెద్ద కాన్వాయ్ ఉంటాయని అందరూ భావిస్తారు. కానీ ఆయన రొటీన్కు భిన్నం!! ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్లో కీలకమైన పదవిలో ఉన్నా సరే ఏ హంగూ ఆర్భాటాలను ప్రదర్శించరు. ఒక సామాన్యుడిలానే ఉంటారు. అప్పుడప్పుడు పార్లమెంట్కు సైతం సైకిల్పై వచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఆయనే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ.
#WATCH | Union Health Minister Mansukh Mandaviya rides a bicycle to Parliament in New Delhi pic.twitter.com/OCW3K896WC
— ANI (@ANI) February 2, 2022
రెండ్రోజులుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సభకు వచ్చిన మన్సుఖ్ మాండవీయ ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తన ప్రొటోకాల్ను సైతం పక్కన పెట్టి.. సైకిల్ తొక్కుకుంటూ పార్లమెంట్కు చేరుకున్నారు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. ఆయన ఇలా సైకిల్పై పార్లమెంట్కు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు.. 2019 నవంబర్ 19న కూడా పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ఇలానే సైకిల్ తొక్కుకుంటూ సభకు వెళ్లారు. ఆ సమయంలో ఢిల్లీలో కాలుష్యం తీవ్రంగా ఉండడంతో ఆయన ఇలా చేశారు. తన వంతుగా పొల్యూషన్ తగ్గించేందుకు కార్లను పక్కన పెట్టి సైకిల్పై పార్లమెంట్కు వెళ్లారు. గతంలో మోడీ కేబినెట్లోని పలువురు మంత్రులు ఢిల్లీ మెట్రోలో కూడా పార్లమెంట్కు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.