
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూట్యూబ్ చానల్ సబ్ స్ర్కైబర్ల సంఖ్య కోటి దాటింది. ప్రపంచ దేశాల నాయకులందరూ మోడీ వెనకాల్నే ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు యూట్యూబ్లో 7 లక్షల మంది, బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారోకు 36 లక్షలు, మెక్సికో ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్కు 30.7 లక్షలు, ఇండోనేషియా ప్రెసిడెంట్ జోకో విడోడోకు 28.8 లక్షలు, వైట్ హౌస్ యూట్యూబ్ చానల్కు 19 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని 5.25 లక్షలు, ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ను 4.39 లక్షల మంది ఫాలో అవుతున్నారు.