
- కేంద్ర హోం మంత్రి అమిత్షా రాక
- హాజరుకానున్న మంత్రులు సీతక్క, తుమ్మల
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్లోని ఆర్యానగర్లో ఏర్పాటుచేసిన జాతీయ పసుపు బోర్డు ఆఫీస్ను కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆదివారం ప్రారంభించనున్నారు. అమిత్ షా మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఇందూరుకు చేరుకోనున్నారు. పసుపు బోర్డు ఆఫీస్ ఓపెనింగ్ తర్వాత బస్వా గార్డెన్లో ఆఫీసర్లతో భేటీ అవుతారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పాల్గొంటారు. అనంతరం అమిత్షా కంఠేశ్వర్ చౌరస్తాలో ఎంపీ అర్వింద్ ధర్మపురి తండ్రి డి.శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరిగే పసుపు రైతుల మీటింగ్లో ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి వెళతారు. అమిత్షా రాక సందర్భంగా నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీ అర్వింద్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.