రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి మృతి.. కామారెడ్డి జిల్లాలో ఘటన

రోడ్డు ప్రమాదంలో  ప్రభుత్వ ఉద్యోగి మృతి.. కామారెడ్డి జిల్లాలో ఘటన

కామారెడ్డి​, వెలుగు: గుర్తు తెలియని వాహనం ఢీకొని ప్రభుత్వ ఉద్యోగి మృతిచెందాడు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్​కు  చెందిన  కె.మహేశ్(30) బిచ్​కుంద కాలేజీలో రికార్డ్​ అసిస్టెంట్​గా పనిచేస్తున్నారు. గురువారం సంగమేశ్వర్​ నుంచి కామారెడ్డికి బైక్​పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో హైవేపై గుర్తు తెలియని వాహనం ఆయనను ఢీకొట్టింది. తలపై నుంచి వెహికల్ వెళ్లడంతో మహేశ్​ స్పాట్​లో చనిపోయాడు.