ట్యూటర్ వేధింపులు.. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. నిజామాబాద్ జిల్లా ప్రైవేట్ హాస్టల్లో ఘటన

ట్యూటర్ వేధింపులు.. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. నిజామాబాద్ జిల్లా ప్రైవేట్ హాస్టల్లో ఘటన

నిజామాబాద్, వెలుగు: ట్యూటర్​వేధింపుల కారణంగా నర్సింగ్​విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.  వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువతి(18) నిజామాబాద్ ప్రభుత్వ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్​సెకండియర్​చదువుతూ నగరంలోని ప్రైవేట్​ హాస్టల్​లో ఉంటోంది. సదరు విద్యార్థిని ఫోన్​నంబర్​తీసుకున్న ట్యూటర్​డాక్టర్​గౌతమ్.. వాట్సాప్, ఇన్​స్టాగ్రామ్​లో ఆమెకు అసభ్యకర మెసేజ్​లు పెట్టి వేధిస్తున్నాడు. 

వేధింపులు మరింత పెరగడంతో శుక్రవారం హాస్టల్​లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. రూమ్మేట్స్ హాస్టల్​ నిర్వాహకులకు తెలిపి జీజీహెచ్​కు షిఫ్ట్​చేశారు. ప్రస్తుతం ఆమె కోమాలో ఉంది. స్టూడెంట్ సూసైడ్​యత్నానికి కారకుడైన ట్యూటర్​ను ఉద్యోగం​నుంచి టర్మినేట్​చేసినట్లు కాలేజీ​ ప్రిన్సిపాల్​డాక్టర్ కృష్ణమోహన్​తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు వన్​టౌన్​ఎస్​హెచ్​వో రఘుపతి తెలిపారు.