60 ఏండ్లలో లేని వృద్ధి.. 8 ఏండ్లలో సాధించిండు

60 ఏండ్లలో లేని వృద్ధి.. 8 ఏండ్లలో సాధించిండు

భోపాల్: గత ప్రభుత్వాలు 60 ఏండ్లలో సాధించలేని అభివృద్ధిని, విజయాలు ప్రధాని మోదీ 8 ఏండ్లలో సాధించారని కేంద్రమంత్రి అనురాగ్​ ఠాకూర్​ చెప్పారు. మిషన్​ చంద్రయాన్–​3, ఇతర కేంద్ర పథకాల సక్సెస్​​ను ఉద్దేశించి ఠాకూర్ ఈ కామెంట్స్ చేశారు. చంద్రుడి దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టిన తొలి దేశంగా ప్రపంచం లో ఇండియా అగ్రస్థానంలో నిలిచిందన్నా రు. మోదీ ప్రత్యేక ప్రసంగాల బుక్ ‘సబ్​కా సాథ్​, సబ్​ కా వికాస్, సబ్​కా విశ్వాస్​’ రిలీజ్​ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు.

 దేశంలో 4 కోట్ల మంది ప్రజలు పక్కా ఇండ్లు పొందారని, 12 కోట్ల కుటుం బాలకు టాయిలెట్స్ సమకూర్చామని, ప్రతి గ్రామానికి విద్యుత్​ సౌకర్యం ఇచ్చామని తెలిపారు. కరోనా కాలంలో 80 కోట్ల మంది ప్రజలు డబుల్​ రేషన్ అందుకున్నట్లు వెల్లడించారు. ఆయుష్మాన్​ భారత్​ పథకం కింద 60 కోట్ల మంది ప్రజలు రూ.5లక్షల విలువైన వైద్యచికిత్స ఉచితంగా పొందారని కేంద్ర మంత్రి తెలిపారు.