స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకెళ్లం.. విశాఖలో కేంద్ర మంత్రి కీలక ప్రకటన

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకెళ్లం.. విశాఖలో కేంద్ర మంత్రి కీలక ప్రకటన

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, బిడ్స్ దాఖలు విషయంలో నాలుగు రోజులుగా చర్చ నడుస్తున్న సమయంలోనే.. ఏప్రిల్ 13వ తేదీ గురువారం విశాఖపట్నం వచ్చారు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్. ఈ క్రమంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏపీలోని జగన్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ ఇచ్చాయి.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్. దాని కంటే ముందు అర్ఎన్ఐఎల్ ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని వెల్లడించారాయన. పూర్తి స్థాయి సామర్ధ్యం మేరకు ప్లాంట్ పని చేసే ప్రక్రియ జరుగుతోందని వివరించారు. వీటిపై అర్ఐఎన్ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామని చెప్పారాయన. తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం ఒక ఎత్తుగడ మాత్రమేనని.. ఇందులో వాస్తవం లేదని వ్యాఖ్యానించారు కేంద్ర సహాయ మంత్రి. దీని ద్వారా ప్రయివేటకరణ నిర్ణయం ప్రస్తుతానికి నిలిచినట్లుగా భావిస్తున్నామన్నారు. ప్రైవేటీకరణ ఆలోచనపై ప్రస్తుతం ముందుకు వెళ్లటం లేదని కేంద్ర సహాయ మంత్రి చెప్పటం ద్వారా స్టీల్ ప్లాంట్ కార్మికులకు, రాజకీయ పార్టీలకు బిగ్ రిలీఫ్ గా మారింది.