
12వ మంత్రివర్గ డబ్ల్యూటీవో సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు జెనీవాకు వెళ్లనున్నారు. అక్కడ ‘ బహు పాక్షిక వాణిజ్య వ్యవస్థ... సవాళ్లు’ అనే అంశంపై ఆయన మాట్లడనున్నారు. ఈరోజు కజకిస్థాన్ చైర్లో నిర్వహించే రిసెప్షన్కు కూడా కేంద్ర మంత్రి హాజరుకానున్నారు. సోమవారం ప్రారంభమయ్యే సదస్సులో ట్రిప్స్ ప్రపోజల్, కరోనా మహమ్మారి తదితర విషయాలను మంత్రి ప్రస్తావించనున్నారు. మంగళవారం ఆహార భద్రత కింద చేపల పెంపకం, వ్యవసాయం గురించి మంత్రి మాట్లాడుతారు. బుధవారం రోజున డబ్ల్యూటీవోసంస్కరణ, ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ కోసం కస్టమ్స్ డ్యూటీపై మారటోరియం జారీ అజెండాగా చర్చ జరగనుంది.
Union Minister for Commerce and Industry, Piyush Goyal will arrive today in Geneva to attend the 12th Ministerial WTO meet. He will be participating in close door session on challenges to multilateral trading system & will be delivering a speech in this session
— ANI (@ANI) June 11, 2022
(File pic) pic.twitter.com/iBL9vellfp