షోయబుల్లాఖాన్ కుటుంబసభ్యులను కలిసిన కిషన్ రెడ్డి

షోయబుల్లాఖాన్ కుటుంబసభ్యులను కలిసిన కిషన్ రెడ్డి

గత పాలకులు విమోచన దినోత్సవాన్ని మరుగున పడేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలో స్వాతంత్య్ర సమరయోధులు షోయబుల్లాఖాన్ కుటుంబ సభ్యులను ఆయన కలిశారు. నిజాం,రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధులను స్మరించుకొని వారి కుటుంబాలను సన్మానిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్లో నిర్వహిస్తున్న విమోచన వేడుకల్లో అమిత్ షా పాల్గొంటారని చెప్పారు. తెలంగాణ విముక్తి ఉత్సవాలను గతంలో ఏ ప్రభుత్వం నిర్వహించలేదన్నారు. కేసీఆర్ సర్కార్ నిరంకుశంగా వ్యవహరిస్తూ బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. 

వందేమాతరం రామచందర్ రావుర కుటుంబానికి సన్మానం

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సంవత్సరం పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో గుర్తింపు దక్కని ఉద్యమకారులను కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారిని స్మరించుకొనున్నట్లు ఆయన తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాతరం అని నినాదించి జైలుకు వెళ్లిన వందేమాతరం రామచందర్ రావు కుటుంబ సభ్యులను కిషన్ రెడ్డి ఇవాళ బేగంబజార్ లో కలిశారు. 

75 ఏళ్ల స్వాతంత్ర్య దేశంలో నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించిన వీరులకు గుర్తింపు దక్కలేదని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏడాది పాటు వారిని స్మరించుకుంటూ... వారి జయంతి, వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తామన్నారు. 1948లో అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ నగరంలో జాతీయ జెండాను ఎగురవేసి నిజాం పాలనకు చరమగీతం పాడరాని.. ఈ ఏడాది సెప్టెంబర్17న హైదరాబాద్ నగరంలో హోమ్ శాఖ మంత్రి అమిత్ షా జాతీయ జెండా ఎగురవేస్తారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.