కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆమె స్వయంగా వెల్లడించారు. కరోనా సోకినందునే ఢిల్లీలోని రాజేంద్రనగర్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరుకాలేకపోయానన్న ఆమె, అందుకు క్షమాపణలు కోరారు. రాజేంద్రనగర్ ప్రజలు రాజేష్ భాటియాకు ఓటు వేసి బీజేపీని గెలిపించాలని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఐసొలేషన్లో ఉన్న స్మృతి... కరోనా బారిన పడడం ఇది రెండోసారి. ఇంతకు ముందు ఆమె 2020లో కరోనా వైరస్ బారినపడ్డారు. అటు ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా 1,530 కేసులు నమోద అయ్యాయి.
राजेंद्र नगर में आयोजित कार्यक्रम में सम्मिलित नहीं हो पाने के लिए मैं वहाँ के नागरिकों से क्षमा चाहती हूँ, क्योंकि मेरी कोरोना रिपोर्ट पॉजिटिव आई है।
— Smriti Z Irani (@smritiirani) June 19, 2022
मैं राजेंद्र नगर के लोगों से @rajeshbhatiabjp जी को वोट देने और @BJP4Delhi को जिताने की अपील करती हूँ। https://t.co/nawn5XTBbu