జనగామ జిల్లాలో ఘోరం .. రోడ్డుపై మగ శిశువును వదిలిన గుర్తు తెలియని వ్యక్తులు

జనగామ జిల్లాలో ఘోరం .. రోడ్డుపై మగ శిశువును వదిలిన గుర్తు తెలియని వ్యక్తులు

జనగామ, వెలుగు : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్​లో బుధవారం తెల్లవారుజామున రోడ్డుపై మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. స్థానికులు, చైల్డ్​వెల్ఫేర్​ అధికారుల కథనం ప్రకారం.. తెల్లవారుజామున గ్రామంలో పసికందు ఏడుపు వినిపించడంతో స్థానికులు నిద్ర లేచి చూడగా రోడ్డుపై మగ శిశువు కనిపించింది. అక్కున చేర్చుకున్న స్థానికులు చుట్టుపక్కల ఆరాతీశారు. ఫలితం లభించకపోవడంతో రఘునాథపల్లి పోలీసులకు, చైల్డ్ హైల్ప్​లైన్​కు ఫోన్​ చేశారు.

 సమాచారం అందుకున్న డిస్ట్రిక్ట్​ చైల్డ్​ప్రొటెక్షన్​యూనిట్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శిశువును రఘనాథపల్లి పీహెచ్​సీకి తరలించి ప్రాథమిక చికిత్సలు చేయించారు. మెరుగైన చికిత్స కోసం జనగామ శివారు ఎంసీహెచ్​లో అడ్మిట్​చేశారు. ఆస్పత్రి సూపరెంటెండెంట్​డాక్టర్ మధుసూదన్​ ట్రీట్ మెంట్​ఇవ్వగా, శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.