ఇంటర్ ఫేక్ ఎగ్జామ్ సెంటర్ కలకలం: 12 మంది సిబ్బంది అరెస్ట్

ఇంటర్ ఫేక్ ఎగ్జామ్ సెంటర్ కలకలం: 12 మంది సిబ్బంది అరెస్ట్

విద్యార్ధులకు నిర్వహించే ఎగ్జామ్స్ ను సొమ్ము చేసుకునేందుకు కేటుగాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఓ వైపు విద్యార్ధులు సంవత్సరం పాటు కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాస్తుంటే.. ఓ స్కూల్ కు చెందిన సిబ్బంది ఫేక్ ఎగ్జామ్ సెంటర్స్ ను ఏర్పాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ లో ఫిబ్రవరి 18నుంచి మార్చి 15వరకు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ ఎగ్జామ్స్ ముసుగులో డియోరియో జిల్లాలో ఓ స్కూల్ కు చెందిన గుమస్తాతో పాటు 11మంది సిబ్బంది ఫేక్ ఎగ్జామ్ సెంటర్స్ ను ఏర్పాటు చేశారు. గుమస్తా ఇంటి సమీపంలో ఉన్న ఓ భవంతిలో ఇంటర్ ఎగ్జామ్ సెంటర్ ను ఏర్పాటు చేసి..అందులో ఇంటర్ బోర్డ్ సీల్ తో ఉన్న ప్రశ్నా పత్రాల్ని కొంతమంది విద్యార్ధుల చేత రాయిస్తున్నారు. అయితే ఫేక్ ఎగ్జామ్ సెంటర్ సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో స్కూల్ స్టాఫ్ తో పాటు ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న పలువురు విద్యార్ధుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విద్యార్ధుల్ని ఇక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నించగా..తాము ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నామని చెప్పడంతో షాక్ తిన్న పోలీసులు..క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఉత్తర్ ప్రదేశ్ ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్ సీల్ వేసిన క్వశ్చన్ పేపర్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫేక్ సెంటర్స్  దందాపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.