
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో దారుణం జరిగింది. మదౌలి గ్రామంలో ఇళ్ల కూల్చివేతల సమయంలో ప్రమీల దీక్షిత్, ఆమె కూతురు సజీవ దహనమయ్యారు. గ్రామంలోని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న నివాసాలను అధికారులు బుల్డోజర్లతో కూల్చేశారు. అయితే ఓ గుడిసెకు నిప్పు అంటుకోవడంతో.. అందులో ఉన్న తల్లీబిడ్డ సజీవదహనం అయ్యారు. మహిళలు గుడిసెలో ఉండగా నిప్పంటించారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. అయితే తల్లీబిడ్డలే నిప్పంటించుకున్నారని పోలీసులు చెప్పారు. తాము వారిని కాపాడేందుకు ప్రయత్నించామని.. ఈ ప్రయత్నంలో ప్రమీల భర్త సహా స్టేషన్ హౌస్ ఆఫీసర్ దినేష్ గౌతమ్కు గాయాలయ్యాయని చెప్పారు. అయితే, తల్లీబిడ్డల మరణానికి ఎవరైనా కారణం అని తెలిస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న సమయంలో వీడియో తీశారని.. ఆ వీడియోను పరిశీలిస్తామని చెప్పారు. యూపీలో హత్యలకు యోగి పరిపాలనే కారణమని సమాజ్వాదీ పార్టీ ఆరోపించింది.బ్రాహ్మణులు కూడా యోగి ప్రభుత్వ దౌర్జన్యాలకు గురి అవుతున్నారని సమాజ్వాదీ పార్టీ ట్వీట్ చేసింది.