​మీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ సేఫ్​గా ఉంచుకోవడం ఇలా...

​మీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ సేఫ్​గా ఉంచుకోవడం ఇలా...

న్యూఢిల్లీ:  మారుమూల ప్రాంతాల్లోనూ గూగుల్​పే, ఫోన్​పే, పేటీఎం వంటి యూనిఫైడ్​ పేమెంట్స్​ ఇంటర్​ఫేస్​ (యూపీఐ) పేమెంట్స్​ విపరీతంగా పెరిగాయి. అగ్గిపెట్టె కొనాలన్నా యూపీఐ వాడుతున్నారు. వీటి వాడకం ఎంతగా పెరిగిందో మోసాలూ అంతలా పెరుగుతున్నాయి. దీంతో ఎంతోమంది డబ్బును నష్టపోతున్నారు. సైబర్​ మోసాల బారినపడకుండా కాపాడుకోవడానికి కింద సూచించిన ఐదు జాగ్రత్తలు పాటించాలి.

స్క్రీన్​లాక్​

ఎవరూ కనిపెట్టలేని విధంగా  స్క్రీన్ లాక్, పాస్‌‌‌‌వర్డ్ లేదా పిన్ పెట్టుకోవడం వల్ల మీ ఫోన్‌‌ సేఫ్​గా ఉంటుంది. మీ చెల్లింపులు,  ఆర్థిక లావాదేవీల యాప్‌‌లను రక్షించడానికి కూడా ఇవి కీలకం.  ఇలా చేస్తే సున్నితమైన పర్సనల్​, ఫైనాన్షియల్​ సమాచారం లీక్ కాదు. అనధికార వ్యక్తులకు యాక్సెస్ ఉండదు.   పేరు, పుట్టిన తేదీ లేదా మొబైల్ నంబర్ వంటి సాధారణ పాస్‌‌వర్డ్‌‌లను ఉపయోగించకూడదు. 

మీ పిన్‌‌ను షేర్ చేయవద్దు

మీ పిన్‌‌ నంబర్​ను షేర్ చేయడం వలన మోసానికి గురయ్యే అవకాశం ఉంది. పిన్​ నంబర్​ ఉంటే మీ ఫోన్‌‌ను మోసగాళ్లు యాక్సెస్‌‌ చేయొచ్చు. మీకు తెలియకుండా లావాదేవీలు చేయొచ్చు. అందుకే మీ పిన్‌‌ నంబర్​ను ఎవరికీ చెప్పకూడదు. ఎవరికైనా తెలిసిందని అనిపిస్తే వెంటనే మార్చాలి.                    

యూపీఐ యాప్ ​అప్​డేటింగ్​  ముఖ్యం

యూపీఐ పేమెంట్​ యాప్​ను ఎప్పటికప్పుడు అప్​డేట్​ చేయాలి. లేటెస్ట్​ వెర్షన్​ను ఉపయోగిస్తేనే లేటెస్ట్​ఫీచర్లు, బెనిఫిట్స్​ ఉంటాయి. గూగుల్​ప్లే, యాపిల్ యాప్​​స్టోర్ ​నుంచి మాత్రమే వీటిని డౌన్​లోడ్​ లేదా అప్​లోడ్​ చేసుకోవాలి. థర్డ్​పార్టీల సోర్స్​లను వాడకపోవడం మంచిది.  ఎక్కువ యాప్స్​ వద్దు యూపీఐ పేమెంట్స్​కు ఒకటిరెండుకు మించి యాప్స్​ వాడకపోవడమే మంచిది. ఎక్కువ యాప్స్​ వల్ల సైబర్​ఫ్రాడ్స్​ జరిగే అవకాశాలు ఉంటాయి. అంతేగాక ఫోన్​ కెసాపిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది.