న్యూఢిల్లీ: మారుమూల ప్రాంతాల్లోనూ గూగుల్పే, ఫోన్పే, పేటీఎం వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పేమెంట్స్ విపరీతంగా పెరిగాయి. అగ్గిపెట్టె కొనాలన్నా యూపీఐ వాడుతున్నారు. వీటి వాడకం ఎంతగా పెరిగిందో మోసాలూ అంతలా పెరుగుతున్నాయి. దీంతో ఎంతోమంది డబ్బును నష్టపోతున్నారు. సైబర్ మోసాల బారినపడకుండా కాపాడుకోవడానికి కింద సూచించిన ఐదు జాగ్రత్తలు పాటించాలి.
స్క్రీన్లాక్
ఎవరూ కనిపెట్టలేని విధంగా స్క్రీన్ లాక్, పాస్వర్డ్ లేదా పిన్ పెట్టుకోవడం వల్ల మీ ఫోన్ సేఫ్గా ఉంటుంది. మీ చెల్లింపులు, ఆర్థిక లావాదేవీల యాప్లను రక్షించడానికి కూడా ఇవి కీలకం. ఇలా చేస్తే సున్నితమైన పర్సనల్, ఫైనాన్షియల్ సమాచారం లీక్ కాదు. అనధికార వ్యక్తులకు యాక్సెస్ ఉండదు. పేరు, పుట్టిన తేదీ లేదా మొబైల్ నంబర్ వంటి సాధారణ పాస్వర్డ్లను ఉపయోగించకూడదు.
మీ పిన్ను షేర్ చేయవద్దు
మీ పిన్ నంబర్ను షేర్ చేయడం వలన మోసానికి గురయ్యే అవకాశం ఉంది. పిన్ నంబర్ ఉంటే మీ ఫోన్ను మోసగాళ్లు యాక్సెస్ చేయొచ్చు. మీకు తెలియకుండా లావాదేవీలు చేయొచ్చు. అందుకే మీ పిన్ నంబర్ను ఎవరికీ చెప్పకూడదు. ఎవరికైనా తెలిసిందని అనిపిస్తే వెంటనే మార్చాలి.
యూపీఐ యాప్ అప్డేటింగ్ ముఖ్యం
యూపీఐ పేమెంట్ యాప్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. లేటెస్ట్ వెర్షన్ను ఉపయోగిస్తేనే లేటెస్ట్ఫీచర్లు, బెనిఫిట్స్ ఉంటాయి. గూగుల్ప్లే, యాపిల్ యాప్స్టోర్ నుంచి మాత్రమే వీటిని డౌన్లోడ్ లేదా అప్లోడ్ చేసుకోవాలి. థర్డ్పార్టీల సోర్స్లను వాడకపోవడం మంచిది. ఎక్కువ యాప్స్ వద్దు యూపీఐ పేమెంట్స్కు ఒకటిరెండుకు మించి యాప్స్ వాడకపోవడమే మంచిది. ఎక్కువ యాప్స్ వల్ల సైబర్ఫ్రాడ్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. అంతేగాక ఫోన్ కెసాపిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది.