యూపీఐకి కూడా ట్యాప్ ​అండ్​ పే

యూపీఐకి కూడా ట్యాప్ ​అండ్​ పే

న్యూఢిల్లీ: క్రెడిట్​ కార్డు మాదిరే ఇక నుంచి యూపీఐ చెల్లింపులకు కూడా ‘ట్యాప్ అండ్​ పే’ సదుపాయం అందుబాటులోకి  రానుంది. వచ్చే నెల 31 నాటికి ఇది అన్ని యూపీఐ యాప్స్​కు అందుబాటులోకి రావొచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్​పీసీఐ) ప్రకటించింది.  భీమ్​, జీపే, పేటీఎం, ఫోన్​పే తదితర యూపీఐ యాప్‌‌‌‌‌‌‌‌ల వినియోగదారులు ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎన్​పీసీఐ యూపీఐ ట్యాప్ అండ్​ పేను అధికారికంగా ఈ ఏడాది సెప్టెంబరులో ‘యూపీఐ పే అడిషనల్​ మోడ్​’గా ప్రారంభించబడింది. సాధారణంగా అయితే యూపీఐతో డబ్బు చెల్లించడానికి కోడ్​ను స్కాన్ చేయాలి. లేదా ఫోన్​నంబరు ఎంటర్​ చేయాలి. ఈ కొత్త పద్ధతిలో, స్కానింగ్ చేయడానికి బదులుగా, మీరు మీ పరికరాన్ని రిసీవర్​పై పెట్టి కొన్ని సెకన్లు ఉంచితే చాలు. 

అచ్చం క్రెడిట్​కార్డుకు చేసినట్టే అన్నమాట. ఫోన్​లో ఉంటే ఎన్​ఎఫ్​సీ చిప్​ ద్వారా డబ్బు మన ఫోన్​ నుంచి మర్చంట్​కు వెళ్తుంది. ప్రస్తుతం ఉన్న యూపీఐ పరిమితులే ట్యాప్ అండ్​ పే పేమెంట్ మోడ్‌‌‌‌‌‌‌‌లకు వర్తిస్తాయి. ఈ పేమెంట్ మోడ్‌‌‌‌‌‌‌‌ని ఉపయోగించడానికి కస్టమర్ ఫోన్​లో కచ్చితంగా ఎన్​ఎఫ్​సీ చిప్​ ఉండాలి. క్యూఆర్​లు/సౌండ్‌‌‌‌‌‌‌‌బాక్స్‌‌‌‌‌‌‌‌లు లేదా యూపీఐ స్మార్ట్ ట్యాగ్‌‌‌‌‌‌‌‌లలోని ఎన్​ఎఫ్​సీ ట్యాగ్‌‌‌‌‌‌‌‌లు కస్టమర్​ ఫోన్​ నుంచి డబ్బు తీసుకుంటాయి. లావాదేవీని పూర్తి చేయడానికి మీ డివైజ్​కు ఇంటర్నెట్ అవసరం.  యూపీఐ పిన్ కూడా కావాలి. మీ లావాదేవీ రూ.500 లోపు ఉండి, యూపీఐ లైట్​మోడ్​ను వాడితే పిన్​ అవసరం ఉండదు. ప్రస్తుతం భీమ్,​  పీటీఎం యాప్​లు ట్యాప్ అండ్​ పే ఫీచర్​ను సపోర్ట్​ చేస్తున్నాయి.

'ట్యాప్ & పే' ఫీచర్‌‌‌‌‌‌‌‌ను ఉపయోగించడం ఇలా.. 
1. యూపీఐ యాప్‌‌‌‌‌‌‌‌ను ఓపెన్​ చేయండి.  ట్యాప్ అండ్​ పే సింబల్​పై క్లిక్ చేయండి.
2.  రిసీవర్‌‌‌‌‌‌‌‌కు పంపాలనుకుంటున్న మొత్తాన్ని టైప్​ చేయండి. రిసీవర్ డివైజ్​పై మీ ఫోన్​ను పెట్టి దాన్ని నొక్కండి.
3. రెండు డివైజ్​లకూ ఎన్​ఎఫ్​సీ ఉండాలి. యాప్ రిక్వెస్ట్ చేయగానే  పిన్ ఎంటర్ చేయాలి.
4. ఇప్పుడు లావాదేవీ విజయవంతమవుతుంది. అన్నీ సరిగ్గా జరిగితే, మీరు మీ స్క్రీన్‌‌‌‌‌‌‌‌పై లావాదేవీ విజయవంతమైనట్టు మెసేజ్​ను చూస్తారు.