
కరోనా ఎఫెక్టుతో మనదేశంలోని అన్ని అమెరికా ఎంబసీలను, కాన్సులేట్లను మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. సోమవారం నుంచి అన్ని రకాల వీసా అపాయింట్ మెంట్లను రద్దు చేస్తున్నామని, వీసా ప్రాసెస్ లను రీ షెడ్యూల్ చేసుకోవాలని అమెరికన్ ఎంబసీ కోరింది. తదుపరి నోటీస్ వచ్చేవరకు మిషన్ ఇండియా రెగ్యులర్ కాన్సులేట్ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. సోమవారం నుంచి న్యూఢిల్లీ, చెన్నై, కోల్కతా, ముంబైలలోని ఆమెరికన్ సెంటర్లు ‘ఇన్ పర్సన్ ప్రోగ్రామింగ్’ ను మాత్రమే పాస్ చేస్తాయని తెలిపింది. మనదేశం నుంచి ముఖ్యంగా తెలుగురాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో స్టూడెంట్లు, ఉద్యోగులు అమెరికాకు వెళ్తుంటారు. వీసా కార్యకలాపాలు ఆగిపోవడంతో ప్రాసెస్లో ఉన్న చాలా మంది ఇబ్బంది పడక తప్పదు. మరోవైపు నౌకలకు కరోనా ఎఫెక్టు నేపథ్యంలో యూఎస్ పోర్టుల నుంచి ప్రధాన క్రూయిజ్ లైన్ల ప్రయాణాలను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ‘నా రిక్వెస్ట్ మేరకు కార్నివాల్, రాయల్ కరేబియన్, నార్వేయన్, ఎంఎస్సీ లాంటి అవుట్ బౌండ్ క్రూయిజ్ లను 30 రోజుల పాటు సస్పెండ్ చేసేందుకు అందరూ అంగీకరించారు’ అని ట్రంప్ శనివారం ట్వీట్ చేశారు.