
- హోమ్ ల్యాండ్ సెక్యూరిటీకి తెలియజేసిన అమెరికా
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి కారణంగా విధించిన ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ వల్ల అమెరికాలో నిలిచిపోయిన మన వాళ్ల హెచ్ 1బీ వీసాల గడువును పొడిగించాలని మన దేశం చేసిన రిక్వెస్ట్ను అమెరికా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ విషయాన్ని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ వాళ్లకు చెప్పామని అధికారులు చెప్పారు. అమెరికాలో ఇరుకుపోయిన ఇండియన్స్ వీసాల గడువు పెంచాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ యూఎస్ డిప్యూటీ సెక్రటరీస్ ఆఫ్ స్టేట్తో మాట్లాడారు. ఈ మేరకు కేంద్ర మంత్రి చేసిన రిక్వెస్ట్ను పరిశీలిస్తున్నట్లు యూఎస్ చెప్పింది. హెచ్1బీ వీసాదారులు 60 రోజులకుపైగా నిరుద్యోగులుగా ఉంటే వారు యూఎస్ను వదిలి స్వదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో దాన్ని 180 రోజులకు పెంచాలని ఎన్నారైలు కూడా వైట్హౌస్ను రిక్వెస్ట్ చేశారు. కరోనా వ్యాప్తి చెందినప్పటి నుంచి అమెరికా ఇండియా పరస్పరం హెల్ప్ చేసుకుంటునే ఉన్నాయి. ఈ నెల 4న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, మోడీ దీనిపై చర్చలు జరపగా.. కేంద్ర మంత్రి జయశంకర్, యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియోతో మాట్లాడారు.