వాషింగ్టన్: అమెరికా ఆర్మీ.. వెనెజువెలా కు చెందిన స్మగ్లర్ల బోట్ ను పేల్చేసింది. అంతర్జాతీయ జలాల పరిధి దాటి అమెరికా వైపు వస్తుండగా సౌత్కామ్ ప్రాంతంలో దాడి చేసినట్లు నేవీ తెలిపింది. ఆ బోట్లో డ్రగ్స్ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే దాడిచేసినట్టు భద్రతా దళాలు వివరించాయి. బోటును పేల్చేయడంతో ముగ్గురు స్మగ్లర్లు మృతిచెందినట్టు వెల్లడించాయి. ఈ ఘటనను ధ్రువీకరిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
అందులో బోట్ కాలిపోతున్న దృశ్యాలు కనిపించాయి. కాగా, భద్రతా దళాల దాడిలో మృతిచెందిన ముగ్గురిని 'నార్కోటెర్రరిస్టులు'గా ట్రంప్ వర్ణించారు. అత్యంత క్రూరమైన డ్రగ్స్ ముఠాలు అమెరికా జాతీయ భద్రత, విదేశాంగ విధానానికి, దేశ ప్రయోజనాలకు ముప్పుగా మారాయని ట్రంప్ పేర్కొన్నారు.
