చికాగోలో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్

చికాగోలో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్

ఈ మధ్య  భారత విద్యార్థులు విదేశాల్లో ప్రమాదాలకు గురి కావడం కలకల రేపుతోంది. లేటెస్ట్ గా చికాగోలో భారత విద్యార్థి అదృశ్యం అయ్యాడు. మే 2 నుంచి తెలంగాణకు చెందిన   విద్యార్థి  చింతకింది రూపేశ్ చంద్ర మిస్సయినట్లు చికాగోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపింది. అతడి ఆచూకి కోసం పోలీసులు ప్రవాస భారతీయులతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. రూపేష్ ఆచూకి తెలిస్తే సమాచారం అందంచాలని పోలీసులు ప్రకటించింది.  రూపేష్ చికాగోలోని  ఎన్ షెరిడాన్ రోడ్  4300 బ్లాక్ నుంచి తప్పిపోయినట్లు చెప్పారు. 

తెలంగాణలోని హన్మకొండకు  చెందిన రూపేశ్ విస్కాన్సిన్ లోని కాంకార్డియా యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. రూపేశ్ మిస్సయిన  విషయం తెలియడంతో అతని తల్లిదండ్రలు ఆందోళనకు గురయ్యారు. తమ కొడుకు ఆచూకి కనుగొనాలంటూ భారత విదేశాంగా శాఖను కోరింది.