భార్య విడాకుల కోసం పిటిషన్..భర్త కుటుంబంపై కాల్పులు

భార్య విడాకుల కోసం పిటిషన్..భర్త కుటుంబంపై కాల్పులు

అమెరికాలో మరోసారి కాల్పులు సంచలనం సృష్టించాయి. ఉటా ప్రావిన్స్‌లోని ఎనోచ్ సిటీలో 8 మంది చనిపోయినట్టు పోలీసులు గుర్తించారు. అయితే వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. ఓ ఇంట్లో సాధారణ చెకింగ్ నిమిత్తం పోలీసులు వెళ్లగా.. ఈ మృతదేహాలు లభ్యమైనట్టు వారు తెలిపారు. వీరిలో ముగ్గురు పెద్దలు, ఐదుగురు పిల్లలు ఉన్నారని, వారంతా తుపాకీ గాయాలతోనే మరణించాలని అధికారులు తేల్చి చెప్పారు. ముందుగా ఏడుగురు ఇంటి సభ్యులను చంపి, ఆ తర్వాత మైఖేల్ హైట్ అనే వ్యక్తి కూడా తనను తాను షూట్ చేసుకున్నట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మైఖేల్ భార్య విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి తన కుటుంబంపై కాల్పులకు పడ్డాడని అధికారులు వెల్లడించారు. మృతుల్లో అతని భార్య, ఆమె తల్లి, దంపతుల ఐదుగురు పిల్లలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఐదురుగు పిల్లల్లో ముగ్గురు బాలికలు, ఇద్దరు అబ్బాయిలున్నట్టు సమాచారం. వివాహ బంధం విచ్ఛిన్నం నేపథ్యంలోనే ఇంత మంది ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ ఘటనపై ఉటా రాష్ట్ర గవర్నర్ స్పెన్సర్ కాక్స్ స్పందిస్తూ.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

 

బుధవారం రాత్రి జరిగిన కాల్పుల్లో 8 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తున్నది. ఈ ఘటన ఎనోచ్‌ సిటీలోని ఓ ఇంట్లో జరిగినట్లు స్థానిక పోలీసుల సమాచారం. అందరి శరీరాలపై బుల్లెట్లు దిగిన గుర్తులు ఉన్నాయని, ఎవరు ఏ ఉద్దేశంతో ఈ దాడికి పాల్పడి ఉంటారో తెలియరాలేదు. దక్షిణ ఉటా ప్రావిన్స్‌లోని ఇనాక్‌ సిటీలోని ఓ ఇంట్లో 8 మంది చనిపోయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాల్ట్‌లేక్‌ సిటీకి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణంలో కాల్పులు జరగడం వల్ల వీరంతా చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలపై బుల్లెట్లు దిగిన ఆనవాళ్ల ఉన్నాయి. పోలీసుల తనిఖీల సందర్భంగా మృతదేహాలు బయటపడ్డాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మృతుల్లో ఐదుగురు చిన్నపిల్లలు ఉన్నారని, ఎవరు కాల్చి చంపారనేది తెలుసుకునేందుకు ఉటా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.