
ఆపరేషన్ సిందూర్ లో రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ లు కుప్పకూలాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్ తో భారత ఆర్మీ విజయం సాధించిందన్నారు. పాక్ లో ని ఉగ్ర స్థావరాలపై కచ్చితైమన దాడులు జరిగాయన్నారు. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఉత్పత్తిలో ఆలస్యం జరుగుతుందని ఎయిర్ మార్షల్స్ చెప్పారన్నారు ఉత్తమ్. ఇదే విషయంలో రాహుల్ గాంధీ, తాము పార్లమెంట్ లో చెప్పామన్నారు.
ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ రిలీజ్ చేయడంలో హాల్ ఫెయిలైందన్నార ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇన్ టైంలో ఎయిర్ క్రాఫ్ట్ లు డెలివరీ చేయడంలో హాల్ ఫెయిల్ అయిందన్నారు. ఇన్ టైంలో ప్రొడక్షన్ పూర్తి అయ్యేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏడాదికి 24 ఎయిర్ క్రాఫ్ట్స్ లు ఉత్పత్తి చేయడంలో హాల్ విఫలమైందన్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధించడంలో విఫలం అయిందన్నారు. మేధావులు రక్షణ రంగంలోకి రావడం లేదన్నారు ఉత్తమ్ కమార్ రెడ్డి
►ALSO READ | Gold News: గోల్డ్ బాంబుపై భారతీయులు.. టిక్-టిక్ మంటున్న పెద్ద ప్రమాదం, నిపుణుడి హెచ్చరిక
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు కూడా జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉండి ఉంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తప్పక స్వాధీనం చేసుకునేవారని, ట్రంప్ కు తలొగ్గి మోదీ యుద్ధం మధ్యలోనే ఆపారని ధ్వజమెత్తారు . ఆపరేషన్ సిందూర్ పేరుతో రాఫెల్ యుద్ధ విమానాలు కోల్పోయామని అన్నారు. ఇది ఆర్మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే అవుతుందని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది.