మూడంతస్తుల భవనం నేలమట్టం...ముగ్గురు మృతి..పలువురికి గాయాలు

మూడంతస్తుల భవనం నేలమట్టం...ముగ్గురు మృతి..పలువురికి గాయాలు

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బారాబంకి జిల్లాలో దారుణ ఘటన జరిగింది.  మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.నలుగురు గాయపడ్డారు. ప‌లువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిలో  ప్రస్తుతానికి 12 మందిని రక్షించారు. బాధితులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 

బారాబంకి జిల్లాలోని ఫతేపూర్ పట్టణంలో సెప్టెంబర్ 4వ తేదీ సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు   మొహల్లా కాజీపూర్ వార్డు 2లో హషీమ్ అనే వ్యక్తికి చెందిన మూడంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది.  ప్రమాద  సమయంలో ఇంటి పరిసరాల్లో దాదాపు 12 మంది నిద్రపోతున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న  తర్వాత ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. బారాబంకి జిల్లా ఎస్పీ దినేష్ కుమార్ సింగ్, సీడీవో ఏక్తా సింగ్, ఏడీఎం అరుణ్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్  సిబ్బంది, స్థానిక ప్రజలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.