
సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు తొమ్మిది రోజుల్లో వారి మొదటి సారిగా వేడి భోజనం ఖిచ్డీని అందించనున్నారు. కార్మికుల కోసం ఖిచ్డీని సిద్ధం చేసిన వంట మనిషి, కార్మికులకు వేడి భోజనం పంపడం ఇదే మొదటిసారి అని చెప్పారు. ఈ ఆహారాన్ని సొరంగం లోపలికి పంపుతారని, వేడి భోజనం పంపడం ఇదే మొదటిసారని అతను వెల్లడించాడు. తాము ఖిచ్డీని పంపుతున్నామని, సిఫార్సు చేసిన ఆహారాన్ని మాత్రమే సిద్ధం చేస్తున్నామని అతను చెప్పాడు.
#WATCH | Uttarkashi (Uttarakhand) Tunnel Rescue: Food items including Khichdi, Dal are being prepared and packed to be delivered to the people trapped inside the tunnel
— ANI (@ANI) November 20, 2023
Cook Hemant says, "Food will be sent to the people trapped inside. For the first time, hot food is being sent… pic.twitter.com/dAVZSSi1Ne
పైప్లైన్ విజయవంతం..
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సోషల్ మీడియా వేదికగా ఓ అప్డేట్ని ప్రకటించారు. ఉత్తరకాశీలోని సిల్క్యారాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్లో, శిధిలాల మీదుగా 6 అంగుళాల వ్యాసం కలిగిన పైప్లైన్ విజయవంతంగా వేయబడిందని తెలిపారు. ఇప్పుడు దీని ద్వారా, ఆహార పదార్థాలు, మందులు, ఇతర వస్తువులు అవసరాన్ని బట్టి కార్మికులకు సులభంగా పంపబడుతుందని ఆయన అన్నారు. రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమైన కేంద్ర ఏజెన్సీలు, ఎస్డీఆర్ఎఫ్(SDRF), రాష్ట్ర పరిపాలన బృందాలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి. కార్మికులందరినీ సురక్షితంగా తరలించడానికి తాము యుద్ధ ప్రాతిపదికన పని చేస్తున్నామని ధామి చెప్పారు.
सिलक्यारा, उत्तरकाशी में निर्माणाधीन टनल के अंदर मलबा आने से फँसे श्रमिकों को बाहर निकालने हेतु चल रहे रेस्क्यू अभियान के अंतर्गत मलबे के आरपार 6 इंच व्यास की पाइप लाइन सफलतापूर्वक बिछा दी गयी है। इसके माध्यम से अब श्रमिकों तक आवश्यकतानुसार खाद्य सामग्री, दवाएं और अन्य सामान…
— Pushkar Singh Dhami (@pushkardhami) November 20, 2023