ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో అగ్రదర్శకుల్లో ఒకరిగా ఓ వెలుగు వెలిగిన వివి వినాయక్… టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్నో హిట్ చిత్రాలు అందించారు. ఇప్పుడు వీవీ వినాయక్ హీరోగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. హీరోగా ఓ సినిమాలో నటిస్తుండడంతో అభిమానులు సర్ప్రైజ్కు గురయ్యారు. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. దర్శకుడు శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఎన్. నరసింహారావు దర్శకత్వం వహించనున్నారు. గతంలో ఈయన ‘శరభ’ అనే సినిమాను తెరకెక్కించారు. మరో రెండు నెలల్లో సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని చిత్రవర్గాలు తెలిపాయి.
2018లో వచ్చిన ‘ఇంటెలిజెంట్’ సినిమాకు వినాయక్ చివరగా దర్శకత్వం వహించారు. సాయి ధరమ్తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ ఫలితాలు అందుకుంది.