కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణం పాత బస్టాండ్ఏరియా వ్యాపార సంఘం అధ్యక్షుడిగా వడ్లకొండ కనకయ్య గౌడ్ఎన్నికయ్యారు. స్థానిక కృష్ణవేణి టాలెంట్స్కూల్లో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. కనకయ్యతోపాటు గుడికందుల రమేశ్, జైన శ్రీధర్, నాకోటి వెంకటేశ్అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. మొత్తం 343మంది ఓటర్లు ఉండగా ఉదయం 335 మంది ఓటు వేశారు.
కనకయ్య గౌడ్126 ఓట్లు సాధించి వ్యాపార సంఘం అధ్యక్షుడిగా గెలుపొందాడు. రమేశ్కు 94, శ్రీధర్కు 83, వెంకటేశ్కు 31 ఓట్లు వచ్చాయి. కొత్త అధ్యక్షుడిని వ్యాపారులు, అభిమానులు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాపారస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రభుత్వపరంగా అందాల్సిన సంక్షేమ ఫలాలను ఇప్పించేందుకు చొరవ చూపుతానని పేర్కొన్నారు.
