వైశాలి షాడంగులేకి ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం. పోటీ ఎక్కువగా ఉండే డిజైనింగ్ రంగంలో తన మార్క్ ఉండాలనుకుంది. భారతీయ సంస్కృతి, ప్రకృతికి అద్దం పట్టే దుస్తులు డిజైన్ చేయడం మొదలుపెట్టింది. ఆ ప్రత్యేకతే వైశాలిని ప్రపంచానికి పరిచయం చేసింది. వైశాలి మనదేశం నుంచి ప్యారిస్ ఫ్యాషన్ వీక్లో ఎంట్రీ సాధించిన మొదటి మహిళా డిజైనర్గా గుర్తింపు తెచ్చుకుంది. ‘వైశాలి ఎస్’ ఫ్యాషన్ బ్రాండ్ను 2011లో మొదలు పెట్టింది. ఆమె డిజైన్లలో భారతీయ కల్చర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. డిజైనర్గా మొదటి ఏడాదిలోనే ‘విల్స్ ఇండియా లైఫ్ స్టైల్ ఫ్యాషన్ వీక్’లో అందరినీ ఇంప్రెస్ చేసింది వైశాలి. ఈసారి ప్యారిస్ ఫ్యాషన్ వీక్లో తన కలెక్షన్ చూపించే అవకాశం వచ్చింది. డిజైనర్ రాహుల్ మిశ్రా (2000) తర్వాత మనదేశం నుంచి ప్యారిస్ ఫ్యాషన్ వీక్ ఎంట్రీ సాధించిన రెండో వ్యక్తి, మొదటి మహిళ వైశాలి కావడం విశేషం.
తండ్రి నుంచి వారసత్వంగా
వైశాలి సొంతూరు మధ్యప్రదేశ్లోని విదిశ. వాళ్ల నాన్న ఆర్టిస్ట్. వైశాలికి ఆర్ట్, డిజైనింగ్ మీద ఇష్టం పెరగడానికి తండ్రే కారణం. టీనేజ్లోనే డిజైనింగ్ తన ప్యాషన్ అని తెలుసుకుంది వైశాలి. డిగ్రీ చదివాక ఫ్యాషన్ డిజైనింగ్ వైపు వెళ్లాలనుకుంది. కంప్యూటర్ సైన్స్ కోర్స్ పూర్తవ్వగానే మనదైన ఫ్యాషన్ మీద అవగాహన కోసం నార్త్ఈస్ట్, వెస్ట్ బెంగాల్, కర్నాటకలోని మారుమూల పల్లెలకు వెళ్లింది. ఆ టైంలోనే తన సొంతూరు విదిశకు మూడు గంటల ప్రయాణ దూరంలో ఉన్న ‘ఛందేరి’లోని చేనేత కుటుంబాల నైపుణ్యం చూసింది. కర్నాటకలోని ఖున్ చేనేత కార్మికుల జీవితాలు కూడా వైశాలిని కదిలించాయి. ‘‘2012లో కర్నాటక బాగల్కోట్ జిల్లాలోని ఖున్ చేనేత కార్మికులను కలిశాను. వాళ్లలో చాలామంది మగ్గాలను మూలన పడేశారు. వాళ్లతో మాట్లాడి, పనితో పాటు పైసలు కూడా ఇప్పిస్తా అని చెప్పాను. దాదాపు నలభై మందిని తిరిగి మగ్గం పట్టేందుకు ఒప్పించాను” అని చెప్పింది వైశాలి. లోకల్గా బాగా ఫేమస్ అయిన ఛందేరి, ఖున్ వంటి చేనేత దుస్తులకు గ్లోబల్ గుర్తింపు తెచ్చిపెట్టాలని, ఫ్యాషన్ డిజైన్లకు కేరాఫ్గా ఉన్న ముంబైకి షిప్ట్ అయింది.
ఎన్నో స్ట్రగుల్స్
ఎన్నో ఆశలతో ముంబైలో అడుగుపెట్టిన వైశాలి మొదట్లో ఆఫీస్ అసిస్టెంట్, జిమ్ ఇన్స్ట్రక్టర్... ఇలా చాలా జాబ్స్ చేసింది. జిమ్ ఇన్స్ట్రక్టర్గా ఉన్నప్పుడే డిజైనర్గా తన జర్నీ మొదలైంది. జిమ్కు వచ్చేవాళ్లకి స్టైలింగ్ టిప్స్, వాళ్లకు ఎలాంటి డ్రెస్లు బాగుంటాయో చెప్పేది. వైశాలికి ఫ్యాషన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ చూసి ఆమె క్లోజ్ ఫ్రెండ్ ప్రోత్సహించింది. అలా ఫ్రెండ్ సలహాతో యాభై వేల లోన్ తీసుకొని ముంబైలోని మలాడ్లో బొటిక్ ఓపెన్ చేసింది వైశాలి. ఇద్దరు టైలర్లతో మొదలుపెట్టిన ఆ బొటిక్ ఆమె లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్. అదే టైంలో ఫ్యాషన్లో కొత్త ఎక్స్పరిమెంట్స్ చేయాలి అనుకుంది. ఢిల్లీలోని పెరల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసి, తర్వాత ఇటలీలోని మిలాన్లో మాస్టర్స్ చదివింది. ఇండియన్, వెస్టర్న్ స్టైల్స్ను మిక్స్ చేసిన డ్రెస్, చీరలు డిజైన్ చేయడం తన స్పెషాలిటీ. అలా డిజైనింగ్లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంది. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్లో కూడా వరుసగా నాలుగేళ్లు (2016–2019) తన కలెక్షన్స్ ప్రదర్శనకు పెట్టింది వైశాలి.
నా ఫోకస్ వాటిమీదే
‘‘డిజైనర్గా కెరీర్ ప్రారంభంలో ముంబై, ఢిల్లీకి చాలాసార్లు వెళ్లాల్సి వచ్చేది. దాంతో నా రెండేళ్ల కూతుర్ని మా ఆయన దగ్గర వదిలేసి వెళ్లేదాన్ని.
నా భర్త నా డ్రీమ్ని అర్థం చేసుకొని సపోర్ట్ చేశారు. భారతీయ చేనేత కళకు మోడర్న్ లుక్ తేవడం. నేటివిటీని చూపించడం మీదనే నా ఫోకస్ అంతా. ప్రపంచంలో మన డిజైన్లకు చాలా మంచి పేరుంది. ప్యారిస్ ఫ్యాషన్ వీక్ నాకెంతో స్పెషల్” అంటోంది వైశాలి.