మెగా హీరో వరుణ్ తేజ్(Varun tej), లావణ్య త్రిపాఠి(Lavanya tripathi) ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నవంబర్ 1న ఇటలీలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వేడకకు మెగా ఫ్యామిలీతో పాటు.. అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అనంతరం ఆదివారం (నవంబర్ 5)న హైదరాబాద్లో జరిగిన రిసెప్షన్ మాత్రం సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై.. నూతన దంపతులను ఆశ్వీరదించారు.
ఇదిలా ఉంటే.. వరుణ్,లావణ్యల పెళ్లిపై తాజాగా ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. వరుణ్, లావణ్య పెళ్లి వీడియో ఓటీటీలో ప్రసారం కానుందని, అందుకోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫిక్స్ రూ. 8 కోట్ల భారీ అమౌంట్ ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపించాయి.
అయితే అది కేవలం పుకారు మాత్రమే అని వరుణ్, లావణ్య పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చారు. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. వరుణ్-లావణ్యల పెళ్లి వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ రూమర్స్. పెళ్లి వీడియో హక్కులను ఏ ఓటీటీకి అమ్మలేదు. దయచేసి ఇలాంటి రూమర్స్ని నమ్మకండి.. అని ఓ ప్రకటనలో తెలిపారు.