మార్కెట్లోకి వేయూ కంప్రెసర్లు

మార్కెట్లోకి వేయూ కంప్రెసర్లు

హైదరాబాద్​, వెలుగు: ఎల్జీ ఎక్విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్ మానుఫ్యాక్చరింగ్ ​కంపెనీల కోసం కంప్రెసర్ బ్రాండ్ వేయూను ఆవిష్కరించింది.  ఈ మేడ్ ఇన్ ఇండియా కంప్రెసర్లను హైదరాబాద్​లో గురువారం విడుదల చేసింది. ఎంఎస్​ఎంఈల అవసరాలకు తగినట్లుగా 5 నుంచి 45 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన కంప్రెసర్లను ప్రవేశపెట్టింది.

స్థిరమైన, వేరియబుల్ స్పీడ్ ఆప్షన్లతో పాటు 7 నుంచి 12.5 బార్ పీడన సామర్థ్యంతో ఈ ఉత్పత్తులను రూపొందించారు.  ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ అండ్ బెవరేజెస్ రంగాలకు ఇవి ఉపయోగపడతాయి.  వేయూ బ్రాండ్ కంప్రెసర్లకు దేశవ్యాప్త సర్వీస్ సపోర్ట్,  వారంటీ లభిస్తాయని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అన్వర్ జయ వరదరాజ్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లకు కూడా విస్తరిస్తామని ప్రకటించారు.