T20 World Cup 2026: 2026 టీ20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన కెనడా.. టోర్నీ ఆడబోయే 13 జట్లు ఇవే!

T20 World Cup 2026: 2026 టీ20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన కెనడా.. టోర్నీ ఆడబోయే 13 జట్లు ఇవే!

2026లో జరగబోయే టీ20 వరల్డ్‌ కప్‌కు ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ పొట్టి సమరానికి ఇప్పటికే 12 జట్లు నేరుగా అర్హత సాధించగా.. క్వాలిఫయర్ ద్వారా కెనడా జట్టు తమ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకుంది. ఒంటారియోలోని కింగ్ సిటీలో జరిగిన అమెరికాస్ రీజినల్ క్వాలిఫైయర్‌లో కెనడా మూడు విజయాలతో క్వాలిఫై అయింది. కెనడియన్లు వరుసగా బహామాస్, బెర్ముడా, కేమన్ దీవులపై విజయం సాధించి ఈ టోర్నీకి అర్హత సాధించిన 13వ జట్టుగా నిలిచింది.  అవతరించింది.
    
2024 టీ20 వరల్డ్ కప్ లో కెనడా ఆడినప్పటికీ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా ఆటోమేటిక్ అర్హత సాధించడంలో విఫలమైంది. దీంతో క్వాలిఫై మ్యాచ్ లు ఆడాల్సి వచ్చింది. ఆతిధ్య దేశాలైన భారత్, శ్రీలంక నేరుగా ఈ టోర్నీకి అర్హత సాధిస్తాయి. 2024 టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 కు అర్హత సాధించిన దేశాలు 2026 వరల్డ్ కప్ కు తమ బెర్త్ లు ఖాయం చేసుకున్నాయి.  ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్‌, యూఎస్‌ఏ, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ ఈ లిస్టులో ఉన్నాయి. 

ALSO READ | ENG vs IND 2025: టెండూల్కర్ పేరు ముందు పెట్టండి..ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుపై గవాస్కర్ ఫైర్

పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌ సూపర్ 8 కు అర్హత సాధించకపోయినా  ర్యాంకింగ్స్ పరంగా అర్హత సాధించాయి. దీంతో 20 జట్లలో ఈ 12 టీమ్స్ 2026 వరల్డ్ కప్ ఆడనున్నాయి. కెనడా కూడా అర్హత సాధించడంతో మిగిలిన 7 స్థానాల కోసం.. యూరప్‌ క్వాలిఫైయర్స్‌ నుంచి రెండు టీమ్స్‌, ఈస్ట్‌ ఏసియా పసిఫిక్‌ క్వాలిఫైయర్స్‌ నుంచి ఒక టీమ్‌, ఆసియా క్వాలిఫైయర్స్‌ నుంచి రెండు టీమ్స్‌, ఆఫ్రికా క్వాలిఫైయర్స్‌ టోర్నీ నుంచి రెండు టీమ్స్‌ అర్హత సాధిస్తాయి. 

2007లో తొలిసారి టీ20 ప్రపంచ కప్ ప్రారంభమైంది. అప్పటి నుంచి పొట్టి సమరాన్ని రెండేళ్ల కొకసారి నిర్వహిస్తూ వస్తున్నారు. మధ్యలో కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడడం తప్పితే ప్రతి రెండు సంవత్సరాలకు ఐసీసీ ఈ టోర్నీ నిర్వహిస్తూ వస్తుంది. 2007, 2009, 2010, 2012, 2014, 2016, 2021, 2022, 2024లో టీ20 వరల్డ్ కప్ జరిగింది. గత ఏడాది జరిగిన 2024 టీ20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలుచుకుంది. వెస్టిండీస్ లోని బార్బడోస్ వేదికగా ముగిసిన ఫైనల్లో సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.