డీఎల్ఎఫ్ సేల్స్​.. రూ.2,040 కోట్లు

డీఎల్ఎఫ్ సేల్స్​.. రూ.2,040 కోట్లు

న్యూఢిల్లీ: రియల్టీ కంపెనీ డీఎల్ఎఫ్​ఈ ఏడాది జూన్​తో ముగిసిన మొదటి క్వార్టర్​లో రూ.2,040 కోట్ల విలువైన ప్రాపర్టీలను అమ్మింది. ఢిల్లీ, గుర్గావ్​లో లగ్జరీ ప్రాపర్టీలకు చాలా డిమాండ్​ ఉందని సంస్థ తెలిపింది. గత ఏడాది జూన్ క్వార్టర్​లోనూ ఇది రూ.2,040 కోట్ల విలువైన ప్రాపర్టీలను అమ్మడం విశేషం.

జూన్​ క్వార్టర్​లో బుకింగ్స్ ​భారీగానే ఉన్నాయని డీఎల్​ఎఫ్​ గ్రూప్​ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ ఆకాశ్​ ఓహ్రీ చెప్పారు. అయితే ఈ క్వార్టర్​లో కొత్త ప్రాజెక్టులను లాంచ్​ చేయలేదని చెప్పారు.