న్యూఢిల్లీ: రియల్టీ కంపెనీ డీఎల్ఎఫ్ఈ ఏడాది జూన్తో ముగిసిన మొదటి క్వార్టర్లో రూ.2,040 కోట్ల విలువైన ప్రాపర్టీలను అమ్మింది. ఢిల్లీ, గుర్గావ్లో లగ్జరీ ప్రాపర్టీలకు చాలా డిమాండ్ ఉందని సంస్థ తెలిపింది. గత ఏడాది జూన్ క్వార్టర్లోనూ ఇది రూ.2,040 కోట్ల విలువైన ప్రాపర్టీలను అమ్మడం విశేషం.
జూన్ క్వార్టర్లో బుకింగ్స్ భారీగానే ఉన్నాయని డీఎల్ఎఫ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆకాశ్ ఓహ్రీ చెప్పారు. అయితే ఈ క్వార్టర్లో కొత్త ప్రాజెక్టులను లాంచ్ చేయలేదని చెప్పారు.