100 మిలియన్ డాలర్ల అప్పు తీర్చిన వేదాంత

100 మిలియన్ డాలర్ల అప్పు తీర్చిన వేదాంత

న్యూఢిల్లీ: బిలియనీర్ అనిల్ అగర్వాల్  నాయకత్వంలోని వేదాంత కంపెనీ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌కు ఈనెల పదో తేదీన 100 మిలియన్​ డాలర్ల (రూ.870 కోట్ల) అప్పును చెల్లించినట్లు తెలిపింది.   తమకు అప్పులు ఎక్కువగా లేవని, రీపేమెంట్లను సకాలంలో చెల్లిస్తున్నామని స్పష్టం చేసింది.  2023 మార్చి వరకు తిరిగి చెల్లించాల్సిన మొత్తం అప్పును ముందే చెల్లించామని, గడిచిన 11 నెలల్లో 2 బిలియన్ డాలర్లు కట్టామని  తెలిపింది.  ఈ ఏడాది జూన్ తో ముగిసే క్వార్టర్​కు లిక్విడిటీ అవసరాలను తీర్చుతామని వేదాంత రిసోర్సెస్​ స్పష్టం చేసింది.

 ‘‘మాకు35 బిలియన్​ డాలర్లకు పైగా మూలధనాన్ని సమీకరించిన రికార్డు ఉంది. మేం ఎప్పుడూ అప్పులను గడువులోపే కడుతున్నాం. తగినంత క్యాష్​ ఫ్లోలను అందించగల  అసెట్ బేస్ ఉంది.  సమీప కాలంలో మా ఆదాయం 30 బిలియన్ డాలర్లుగా ఉంటుందని భావిస్తున్నాం" అని  పేర్కొంది. 2022 ఆర్థిక సంవత్సరంలో వేదాంత లిమిటెడ్​కు​6.1 బిలియన్​ డాలర్ల ఇబిటా,  3.6 బిలియన్​ డాలర్ల ఫ్రీ క్యాష్​ ఫ్లో వచ్చింది.