పీవీల అమ్మకాల్లో 11 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ: కరోనా వల్ల ఎంతో నష్టపోయిన ఆటో కంపెనీలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. అన్ని కేటగిరీల్లో గత నెల 17.32 లక్షల వెహికల్ యూనిట్లు అమ్ముడయ్యాయి. 2020 జనవరి అమ్మకాలతో (16.50 లక్షల యూనిట్లు) పోలిస్తే అమ్మకాలు ఐదు శాతం పెరిగాయి. హోల్సేల్ విధానంలో గత నెల 2.76 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. 2020 జనవరి అమ్మకాలు 2.48 లక్షల యూనిట్స్తో పోలిస్తే ఇవి 11.14 శాతం పెరిగాయని సొసైటీ ఆఫ్ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్(సియామ్) ప్రకటించింది. డీలర్లకు టూవీలర్ డిస్పాచ్లు 6.63 శాతం పెరిగి 14.29 లక్షలకు చేరుకున్నాయి.
బైకుల సేల్స్ 5.1 శాతం పెరిగి 4.54 లక్షల యూనిట్లుగా, స్కూటర్సేల్స్9.06 శాతం పెరిగి 4.54 లక్షల యూనిట్లుగా రికార్డయ్యాయి. త్రీవీలర్స్సేల్స్ మాత్రం ఏకంగా 56.76 శాతం పడి 26,335 యూనిట్లకు తగ్గాయి. గత జనవరిలో 4.16 లక్షల యూనిట్ల త్రీవీలర్లు అమ్ముడయ్యాయి. మారుతీ సుజుకీ, హ్యుండై, కియా మోటార్స్, టాటా కంపెనీల హోల్సేల్స్ను పెంచుకున్నాయి. సాధారణ కార్ల కంటే స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ ఎక్కువ అమ్ముడయ్యాయి. ‘‘ఇప్పటికీ సప్లై చెయిన్ సమస్యలు ఉండటం, ఉక్కు రేట్లు పెరగడం, సెమీకండక్టర్ల అవైలబిలిటీ తక్కువగా ఉండం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి”అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ వివరించారు.