- ఇద్దరి నుంచి రూ.75 లక్షలు తీసుకున్న డ్రగ్స్ కేసు నిందితుడు రఘు తేజ
గచ్చిబౌలి, వెలుగు : ఫుడ్కోర్టులో ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ఇస్తానని చెప్పి డ్రగ్స్ కేసు నిందితుడు వెలగపూడి రఘుతేజ.. ఇద్దరి నుంచి భారీగా డబ్బు తీసుకొని మోసం చేశాడు. ఈ ఘటన గచ్చిబౌలి పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గచ్చిబౌలికి చెందిన ఠాగూర్ ప్రసాద్ మోటూరికి 2021లో ఓ కామన్ ఫ్రెండ్ద్వారా వెలగపూడి శ్రీనివాస్, అతని కొడుకు రఘుతేజ పరిచయం అయ్యారు. వీరిద్దరూ ప్రసాద్కు ఇన్ఫినిటీ డ్రైవ్ఇన్ఫుడ్కోర్టును పెడుతున్నామని, ఇందులో ఇన్వెస్ట్ చేయాలని, 5 శాతం ప్రాఫిట్ఇస్తామని కోరారు. దీంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు.
ఆ తర్వాత ప్రసాద్రూ.75 లక్షలు శ్రీనివాస్కు ట్రాన్స్ఫర్చేశాడు. అనంతరం తండ్రీకొడుకులు ఎలాంటి ప్రాఫిట్ను ప్రసాద్కు ఇవ్వడం లేదు. తనకు రెవెన్యూ డాక్యుమెంట్లు, ప్రాఫిట్ఇవ్వాలని ప్రసాద్అడగ్గా 2022 డిసెంబర్లో రూ. 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు. మిగిలిన డబ్బులు కూడా ఇవ్వాలని అడగ్గా బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ప్రసాద్ తనను చీటింగ్చేసిన తండ్రీకొడుకులపై బుధవారం గచ్చిబౌలి పోలీసులకు కంప్లయింట్ చేయగా శ్రీనివాస్, రఘుతేజపై 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అదేవిధంగా ఫుడ్కోర్టు పేరుతో రఘుతేజ, శ్రీనివాస్పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని చీటింగ్చేసినట్లు బాధితుడు కళ్యాణ్చక్రవర్తి ఈనెల 14న గచ్చిబౌలి పోలీసులకు కంప్లయింట్ చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే రఘుతేజపై రాయదుర్గం పీఎస్లో డ్రగ్స్కేసు నమోదైంది. అయితే, డ్రైవ్ఇన్లో పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడిన తండ్రీ కొడుకులను అరెస్ట్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.