ఎన్నికలు వస్తేనే ఉద్యోగ నోటిఫికేషన్లు గుర్తుకొస్తయా?

ఎన్నికలు వస్తేనే ఉద్యోగ నోటిఫికేషన్లు గుర్తుకొస్తయా?

హైదరాబాద్: ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్ కు ఉద్యోగ నోటిఫికేషన్లు గుర్తుకొస్తాయని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి అన్నారు. నోటిఫికేషన్లు అంటూ నిరుద్యోగుల ఓట్లు దండుకుని.. ఆ తర్వాత వాటి ఊసెత్తరని మండిపడ్డారు. ఇప్పుడు ఉద్యోగ ఖాళీలపై కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. నలుగురు ఐఏఎస్ అధికారులతో ‘పరిపాలనా సంస్కరణ కమిటీ’ అనే పేరుతో మరోసారి ఉద్యోగ ఖాళీల భర్తీని జాప్యం చేసేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిసారి ఏదో ఒక సాకు చెబుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. 

 

ఎన్నికలొస్తే చాలు ఇదిగో నోటిఫికేషన్లు... అదిగో నోటిఫికేషన్లు అంటూ నిరుద్యోగుల ఓట్లను దండుకుని, ఎన్నికలు అయిపోయాక ఆ ఊసెత్తని సీఎం కేసీఆర్... ఇప్పుడు ఉద్యోగ ఖాళీల భర్తీపై కొత్త నాటకానికి తెరలేపుతున్రు. తాజాగా... నలుగురు ఐఏఎస్‌ అధికారులతో ‘పరిపాలనా సంస్కరణల కమిటీ' పేరుతో మరోసారి ఉద్యోగ ఖాళీల భర్తీని జాప్యం చేసేందుకు ప్రయత్నం చేస్తున్రు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తే... ఆర్థికభారం పెరుగుతుందన్న ఉద్దేశంతోనే ప్రతిసారీ ఏదో ఒక సాకు చెబుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్రు. మొన్న ఉద్యోగ ఖాళీల వివరాలు సమగ్రంగా లేవని, పూర్తి వివరాలు సేకరించాలంటూ అధికారులను ఆదేశించి... ఆ తర్వాత ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి కాగానే భర్తీ చేస్తామని ప్రకటించారు. కానీ, ఇప్పుడు విభజన ప్రక్రియ కొలిక్కి రావడంతో కమిటీ పేరిట మరో సాకును ముందుకు తెచ్చి తన కపట కుట్రను బట్టబయలు చేసుకున్నారు. రాష్ట్రంలో 1.91లక్షల ఖాళీలు ఉన్నట్లు బిశ్వాల్ కమిటీ చెప్పగా... దానిని పక్కన పెట్టి మరీ హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో 70-80 వేల పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసిఆర్ స్వయంగా ప్రకటించారు. కానీ, ఇప్పటివరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మళ్లీ కొత్త కమిటీ అంటూ కాలయాపన చేయడం వల్ల 29 లక్షల మంది నిరుద్యోగులకు నోటిఫికేషన్లపై ఎదురుచూపులే మిగిలనున్నట్టు అర్దమవుతోంది. తాజాగా ఏర్పాటైన కమిటీ ఒకవేళ నివేదికను త్వరగా ఇచ్చినా... కేసీఆర్ సర్కార్ మళ్లీ ఏదో సాకును ముందుకు తెచ్చినా ఆశ్చర్యపోనక్కర లేదు. ఎందుకంటే, ఎన్నికల ముందు నోటిఫికేషన్లు వెలువడినా... మళ్లీ కోర్టు చిక్కుల్లో ఇరుక్కునేలా నోటిఫికేషన్లను తయారు చేయడం ఈ కేసిఆర్ సర్కార్‌కు షరా మామూలే. ఇన్నేళ్లుగా రాష్ట్రంలో అదే జరిగింది కాబట్టి, నోటిఫికేషన్ల జారీలో తాత్సారం చేయడానికి సీఎం కేసీఆర్ జిత్తులు వేస్తున్నారు. కానీ ఎన్ని జిత్తులు, ఎన్ని ఎత్తులు వేసినా రానున్న ఎన్నికల్లో నిరుద్యోగ యువత... ఈ కేసిఆర్ సర్కార్‌ను గద్దె దించడం ఖాయం. విజయశాంతి

Posted by Vijayashanthi on Wednesday, January 19, 2022

‘రాష్ట్రంలో 1.91లక్షల ఖాళీలు ఉన్నట్లు బిశ్వాల్ కమిటీ  చెప్పగా.. దానిని పక్కన పెట్టి మరీ హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో 7 వేల పోస్టులను భర్తీ చేస్తామని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. కానీ, ఇప్పటివరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా.. మళ్లీ కొత్త కమిటీ అంటూ కాలయాపన చేస్తున్నారు. దీని వల్ల 29 లక్షల మంది నిరుద్యోగులకు నోటిఫికేషన్లపై ఎదురుచూపులే మిగలనున్నట్టు అర్దమవుతోంది. తాజాగా ఏర్పాటైన కమిటీ ఒకవేళ నివేదికను త్వరగా ఇచ్చినా.. కేసీఆర్ సర్కార్ మళ్లీ ఏదో సాకును ముందుకు తెచ్చినా ఆశ్చర్యపోనక్కర లేదు. ఎందుకంటే, ఎన్నికల ముందు నోటిఫికేషన్లు వెలువడినా.. మళ్లీ కోర్టు చిక్కుల్లో ఇరుక్కునేలా నోటిఫికేషన్లను తయారు చేయడం ఈ ప్రభుత్వానికి షరా మామూలే. ఇన్నేళ్లుగా రాష్ట్రంలో అదే జరిగింది కాబట్టి, నోటిఫికేషన్ల జారీలో తాత్సారం చేయడానికి కేసీఆర్ జిత్తులు వేస్తున్నారు. కానీ ఎన్ని జిత్తులు, ఎత్తులు వేసినా.. రానున్న ఎన్నికల్లో నిరుద్యోగ యువత కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించడం ఖాయం’ అని విజయశాంతి అన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

కాంగ్రెస్ను వీడిన మరో ఎమ్మెల్యే

ఎమ్మెల్యేను తరిమికొట్టిన గ్రామస్థులు

భారత యువకుడ్ని కిడ్నాప్ చేసిన చైనా