హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, టీఆర్ఎస్పార్టీలు విమోచనాన్ని విలీన దినోత్సవంగా నిర్వహించాయని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. సెప్టెంబర్17 తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు అందించిన రోజని, ఈ గడ్డ ప్రజలు రజాకార్ల అధికార నియంతృత్వం నుంచి విమోచనం పొందితే దాన్ని భారతదేశంలో విలీనం కింద నిర్వహించుకోవడం ఎంతవరకు సమంజసం అన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్పార్టీలకు విమోచనకు, విలీనానికి తేడా తెలియడం లేదన్నారు. టీఆర్ఎస్పార్టీకి ప్రభుత్వం తరఫున అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహించేందుకు ధైర్యం చాలడం లేదని మండిపడ్డారు.