ప్రజావాణి ఫిర్యాదులను తొందరగా పరిష్కరించాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి

ప్రజావాణి ఫిర్యాదులను తొందరగా పరిష్కరించాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి

వికారాబాద్, వెలుగు :  ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను తొందరగా పరిష్కరించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి 45 అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 24,30,31 తేదీల్లో నిర్వహించనున్న సదరం క్యాంపులకు సంబంధించి ఇవ్వాల్టి నుంచి మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు.  ఖేలో ఇండియా విమెన్స్ కిక్ బాక్సింగ్ పోటీల్లో నేషనల్ లెవెల్ లో వికారాబాద్ జిల్లా బొంరాస్​పేట్ కేజీబీవీకి చెందిన నలుగురు విద్యార్థినులు పతకాలు సాధించగా వారిని కలెక్టర్ అభినందించారు.

అగ్నిపథ్ స్కీమ్ లో భాగంగా ఎయిర్ ఫోర్స్ లో అగ్ని వీర్ వాయు కోసం జిల్లా యువత ముందుకు రావాలని కలెక్టర్ నారాయణ రెడ్డి కోరారు.  ఇండియర్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ గురు ప్రీత్ అత్వాల్ తో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు.  కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటర్మీడి యట్ లేదా తత్సమాన విద్యార్హత ఉండి, 2004 జనవరి 2 నుంచి 2007 జనవరి 2 మధ్య జన్మించిన యువత అగ్ని వీర్ వాయు కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.