
పాపన్నపేట, వెలుగు: ఆపరేషన్ కగార్ ఆపేసేలా ప్రజలు ఉద్యమించాలని అరుణోదయ సాంస్కృతిక సమైఖ్య చైర్మన్ విమలక్క పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి మెదక్ జిల్లా పాపన్నపేట మండలం అన్నారం గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ అనంతరం కొత్తపల్లిలో జరిగిన సమావేశానికి ముఖ్యవక్తగా హాజరై ఆమె మాట్లాడారు.
మెదక్ జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. మెతుకు సీమ పోరుబాటలో అనేక మంది అమరులయ్యారన్నారు. అడవిని బడా వ్యాపారులకు అప్పజెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ కొనసాగిస్తుందన్నారు. లంబాడిహక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు దానురాం నాయక్ పాల్గొన్నారు.